Red movie: లాక్‌డౌన్ కారణంగా విడుదలలో జాప్యమైన రెడ్ సినిమా ఇప్పుడు సిద్ధమవుతోంది. సంక్రాంతి నాడు తెలుగింట వెండితెరపై ప్రదర్శితం కానుంది. సినిమాలో రామ్ విశ్వరూపం ఉంటుందనేది చిత్ర యూనిట్ చెబుతున్న మాట..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రామ్ హీరో( Hero Ram )..కిషోర్ తిరుమల ( kishore tirumala ) దర్శకీకరించిన సినిమా రెడ్ ( Red movie ). శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించారీ చిత్రాన్ని. వాస్తవానికి ఏప్రిల్ నెలలోనే విడుదల కావల్సి ఉన్నా..లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైంది. ప్రేక్షకులకు ధియేటర్ అనుభూతి కల్గించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటివరకూ నిరీక్షించామనేది హీరో రామ్ చెబుతున్న మాట.


రామ్ ద్విపాత్రాభినయంలో నటించగా..నివేతా పేతురాజ్( Nivetha pethuraj ), మాళివిక శర్మ ( Malavika sharma ), అమృతా అయ్యర్ ( Amritha ayyar )‌లు కధానాయికలుగా ఉన్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. తొలిసారి రామ్ ద్విపాత్రాభినయంలో నటించిన క్లాస్, మాస్ కాంబినేషన్ అని దిల్ రాజు చెప్పారు. ఈ సినిమాలో హీరో రామ్ విశ్వరూపం చూడవచ్చని దర్శకుడు చెబుతున్నారు. తన శైలికి భిన్నంగా కిషోర్ తిరుమల ( Kishore tirumala )ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 9 నెలల అనంతరం ధియేటర్లలో సినిమాలిప్పుడు విడుదలవుతున్నాయి. సినిమా చూసి భద్రంగా ఇంటికి వెళ్లేలా యాజమాన్యాలు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కొత్త యేడాదికి, సంక్రాంతికి మరిన్ని సినిమాలు రానున్నాయి.


Also read: Tuck Jagadish Movie: నాని ‘టక్ జగదీష్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది