బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ధైర్యంగా ఉన్న విషయాలు మాట్లాడిన నటీమణి కంగనా రనౌత్ (Kangana Ranaut). ఇండస్ట్రీలో బంధుప్రీతి, వారసత్వం (Nepotism) కారణంగానే సుశాంత్ లాంటి వాళ్లు సమస్యలు ఎదుర్కొన్నారని, కొందరు ప్రాణాలు తీసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా కంగనా రనౌత్‌పై డ్రగ్స్ తీసుకుంటుందన్న ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్‌లో డ్రగ్ మాఫియాపై మాట్లాడినందుకు, ఆమెనే డ్రగ్స్ తీసుకుంటుందంటూ కొందరు ఆరోపించారు. ఈ విషయాలను కంగనా చాలా సీరియస్‌గా తీసుకుంది. YS Jagan: సీఎం జగన్‌కు 3 ఇళ్లు.. అందుకే 3 రాజధానులా?: టీడీపీ ఎమ్మెల్యే


తనకు డ్రగ్ డీలర్లతో సంబంధాలున్నాయని నిరూపించగలిగితే తాను ముంబైని శాశ్వతంగా వదిలి వెళ్తానని సవాల్ విసిరింది. ముంబై పోలీసులు, హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాకు డ్రగ్ టెస్టులు చేయండి. నా అన్ని కాల్ రికార్డులు పరిశీలించండి. ఏదైనా డ్రగ్స్ డీలర్‌తో సంబంధాలుగానీ, డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగానీ నిరూపిస్తే.. తప్పు చేశానని ఒప్పుకుంటాను. ముంబైని శాశ్వతంగా వదిలి వెళ్లిపోతానని కంగనా రనౌత్ పేర్కొందిBigg Boss 4: పాపం గంగవ్వ.. ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యింది వీరే...