Megastar Chiranjeevi | తెలుగు సినీ పరిశ్రమకు మెగాస్టార్ అయిన చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివతో కలిసి ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్.. అదే సమయంలో ఇతర ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రాజకీయాల నుంచి బయటికి వచ్చాక... సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తున్నారు. వరుసగా భారీ బడ్జెట్ మూవీస్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. తాజాగా లూసిఫర్, వెదలం చిత్రాలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మెగాస్టార్. ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ట్రెండ్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | WhatsApp Pay : వాట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు


వెదళాం రీమేక్ వర్షన్ కోసం మెగాస్టార్ ( Megastar Chiranjeevi) భారీ పారీతోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న ఆచార్య ( Acharya) మూవీకి చిరంజీవి రూ.50 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. కాగా వెదళాం కోసం ఇంకాస్త పెంచి రూ.60 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.


అయితే ఈ పారితోషికం విషయంలో నిర్మాత అనిల్ సుంకర మాత్రం వెనకడుగు వేయడం లేదట. ఎందుకంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్ముతున్నారట. అందుకే ఎస్ చెప్పినట్లు సమాచారం. ఈ మూవీని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు



Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR