Koffee with Karan: ప్రముఖ సెలెబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్‌పై ఇక దక్షిణాది తారలు హల్‌చల్ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ అగ్రహీరోలు ఓ వైపు, సమంత-రష్మిక మరోవైపు సందడి చేసేందుకు సిద్ధమౌతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్నటివరకూ బుల్లితెరపై ప్రసారమై అందర్నీ అలరించిన కాఫీ విత్ కరణ్ ఇక నిల్చిపోయింది. ఇక నుంచి అంటే 7వ సీజన్ నుంచి కాఫీ విత్ కరణ్ సెలెబ్రిటీ టాక్ షో ఓటీటీ డిస్మీ‌హాట్ స్టార్ వేదికపై స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటివరకూ ఈ షో ఉత్తరాదికే పరిమితమైంది. ఇక నుంచి ఈ వేదికపై దక్షిణాది తారలు సందడి చేయనున్నారు. కాఫీ తాగుతూ ముచ్చట్టు చెప్పేందుకు దక్షణాది తారల్ని సిద్ధం చేస్తున్నాడు కరణ్ జోహార్. 


బాహుబలి ప్రభాస్, పుష్ప అల్లు అర్జున్‌లతో కాఫీ విత్ కరణ్ ఒక ఎపిసోడ్ చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ అగ్రనటులైన రామ్‌చరణ్, తారక్‌లతో మరో ఎపిసోడ్ చిత్రీకరించనున్నాడు కరణ్. వాస్తవానికి ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇక కలిసి షో చేస్తే మరింత సందడిగా ఉంటుంది. ఇక పుష్ప సినిమాతో రష్మిక మందన్నా, సమంత ప్రభులు జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ ఇద్దరినీ ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు కరణ్ ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు కోలీవుడ్ నుంచి నయనతార విఘ్నేష్ శివన్‌ను ఇదే వేదికపై తీసుకొచ్చేందుకు కరణ్ జోహార్ ప్రయత్నిస్తున్నాడు.


Also read: KGF 2 Records & OTT: కేజీఎఫ్ ఛాప్టర్ 2 మరో రికార్డు.. ఓటీటీలో ఎప్పుడో తెలుసా..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.