Aishwarya Dhanush tests Covid Positive: కోలీవుడ్  దర్శకురాలు, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఐశ్వర్య ధనుష్ ఈ విషయాన్ని వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారినపడ్డాను. దీంతో ఆసుపత్రిలో చేరాను. దయచేసి అందరూ మాస్క్ ధరించండి.. వ్యాక్సిన్ వేయించుకోండి. బీ సేఫ్..' అంటూ ఐశ్వర్య ధనుష్ తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు. చేతి మడమకు సెలైన్ ప్లాస్టర్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.


ఐశ్వర్య ధనుష్ త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. అదే సమయంలో ఐశ్వర్య-ధనుష్ మళ్లీ కలుసుకోవాలని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'మీరు త్వరగా  కోలుకోవాలి. ధనుష్ తన మనసు మార్చుకుని మళ్లీ మీ వద్దకు తిరిగొస్తాడనే నమ్మకం ఉంది. జరిగిందేదో జరిగిపోయింది. మీ పిల్లల కోసమైనా ఇద్దరూ కలవండి.' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 


ఐశ్వర్య, ధనుష్ జంట తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లు  గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ మళ్లీ కలుస్తారంటూ ధనుష్ (Aishwarya Dhanush) తండ్రి కస్తూరి రాజా ఇటీవల కామెంట్స్ చేయడం గమనార్హం. విడాకుల తర్వాత అటు ఐశ్వర్య, ఇటు ధనుష్ ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఇంతలోనే ఐశ్వర్య కరోనా బారినపడ్డారు. ఐశ్వర్యకు కరోనా సోకడంపై ధనుష్ స్పందిస్తారా లేదా చూడాలి. 


Also Read: Gelatin Sticks: కారులో 1000 జిలెటిన్ స్టిక్స్.. కలకలం రేపిన పేలుడు పదార్థాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook