Mahesh Babu in isolation: టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఐసోలేష‌న్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. స‌ర్కారు వారి పాట మూవీ షూటింగ్ సెట్‌లో తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్‌కి కరోనా సోకినట్టు తేలిన వెంటనే మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు ఫిలింనగర్ టాక్. మహేష్ బాబు పర్సనల్ హెయిర్‌ స్టైలిస్ట్‌తో పాటు, సర్కారు వారి పాట మూవీ (Sarkaru vaari paata movie) యూనిట్‌లోని మరో నలుగురు సభ్యులకు కూడా క‌రోనా నిర్దారణ అయినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే, మహేష్ బాబు ఆరోగ్య ప‌రిస్థితి ఏంటనే అంశంపై మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి అధికారిక స‌మాచారం వెల్లడి కాలేదు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, కరోనా కేసులు భారీగా పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఇటీవలె హైదరాబాద్‌లో జరుగుతున్న సర్కారు వారి పాట మూవీ షూటింగ్‌ని (Sarkaru vaari paata shooting) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి మళ్లీ మామూలు పరిస్థితులు వచ్చాకే సర్కారు వారీ పాట మూవీ షూటింగ్ ప్రారంభించనున్నారు. 


Also read : 18 ఏళ్లకు పైబడిన వారు COVID-19 vaccine కోసం తమ పేర్లు ఇలా నమోదు చేసుకోవచ్చు


పరశురాం డైరెక్ట్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమాను (Sarkaru vaari paata movie) మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌజ్ అయిన జీఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు అభిమానులకు 2022 సంక్రాంతి పండగ కానుకగా ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ (Actress Keerthy Suresh) జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.