Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు. ఇప్పుడు 13 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత తిరిగి నటిస్తున్నారని తెలుస్తోంది. అదేంటనుకుంటున్నారా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా, అన్ని వర్గాల్ని కలుపుకునిపోయే వ్యక్తిగా మెగాస్టార్ చిరంజీవి స్థానం ఎప్పుడూ ప్రత్యేకం. సినీ పరిశ్రమలో పెద్ద కాబట్టే..గత కొద్దికాలంగా ఏపీ ప్రభుత్వానికి, సినిమా వర్గాలకు మధ్య నలుగుతున్న సినిమా టికెట్ల విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్..చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. నటన నుంచి రాజకీయాల్లో వచ్చి పార్టీ స్థాపించిన చిరంజీవి తనదైన ముద్ర వేశారు. తిరిగి సినీ రంగప్రవేశం చేశారు. చిరంజీవి సెకండ్ ఎంట్రీ కూడా సంచలనంగానే సాగుతోంది. 


ఇప్పుడు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి కమర్షియల్ యాడ్స్ చేయనున్నారు. సినిమా హీరోలు కానీ, చిరంజీవి గానీ కమర్షియల్ ప్రకటనల్లో నటించడం కొత్తేమీ కాదు. అయితే ప్రజారాజ్యం పార్టీ స్థాపన నుంచి యాడ్స్, సినిమాలకు దూరంగా ఉన్నారు. అనంతరం తిరిగి సినిమాల్లో నటిస్తున్నా..ప్రకటనలు మాత్రం ఇప్పటి వరకూ చేయలేదు. అలా 13 ఏళ్ల విరామం ఏర్పడింది. గతంలో థమ్స్‌అప్, నవరత్న ఆయిల్ వంటి బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరించిన చిరంజీవి..ఇప్పుడు మళ్లీ ఓ కమర్షియల్ యాడ్‌లో కన్పించనున్నారు. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. చిరంజీవి (Chiranjeevi ) నటింటిన ఆచార్య సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. త్వరలో రియల్ ఎస్టేట్ యాడ్‌తో మళ్లీ కమర్షియల్ యాడ్స్‌కు చిరు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. 


Also read: AP Tickets Issue: ఏపీ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల కీలక భేటీ, ప్రభాస్, రాజమౌళి, ఎన్టీఆర్, మహేశ్ బాబు సహా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook