నీ కన్ను నీలి సముద్రం పాట సినిమా విడుదలకు ముందే యూట్యూబ్‌లో పెను సంచలనం సృష్టించింది. ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో ఆల్ టైమ్ పాపులర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఉప్పెన సినిమాలోని Nee kannu neeli samudram song ఇప్పుడు ఈ సినిమాపైనే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు ఈ సినిమా ద్వారా తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ ఆడియెన్స్‌కి సుపరిచితుడైన సాయిధరమ్ తేజ్‌కి సోదరుడే ఈ వైష్ణవ్ తేజ్. Also read: Chiranjeevi: చెల్లెళ్లను ఆట పట్టించిన చిరంజీవి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేసిన ఈ సినిమా వాస్తవానికి లాక్‌డౌన్‌కి ముందే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఐతే, కరోనావైరస్ కారణంగా అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమ కూడా తాత్కాలికంగ మూతపడడంతో ఈ సినిమా అన్ని సినిమాల్లాగే విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. కాకినాడ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా.. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. Also read: Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్ రానుందా ?