చలనచిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వరుసకు సోదరుడైన నిర్మాత, దర్శకుడు పి సోమశేఖర్ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన సోమశేఖర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సోమశేఖర్ పనిచేశారు. రంగీలా, దౌడ్, సత్య సినిమాలకు సోమశేఖర్ ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. బాలీవుడ్‌లో ముస్కురాకే దేఖ్ జరా అనే సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శకనిర్మాత మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. సోమశేఖర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్య సినిమా షూటింగ్ సమయంలో ఆర్జీవీ (Ram Gopal Varma) కంటే ఆయన సోదరుడు సోమశేఖర్‌ను చూస్తేనే ఎక్కువ భయపడేవాడినని నటుడు జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం తెలిసిందే.


Also Read: LIC Policy: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతినెల రూ.6,859 మీ చేతికి అందిస్తున్న ఎల్ఐసీ


ఇటీవల తన తల్లికి కరోనా సోకిన సమయంలో సోమశేఖర్ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి బారిన పడిన తన తల్లిని రక్షించుకోగలిగారు కానీ అదే వైరస్ బారి నుంచి తనను తాను కాపాడుకోలేకపోయారంటూ సోమశేఖర్ మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Also Read: Keerthy Suresh: కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న మహానటి ఫేమ్ కీర్తి సురేష్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook