Bandla Ganesh Corona: టాలీవుడ్ లో అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇటు టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక మంది సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా 'నటకిరీటీ' రాజేంద్ర ప్రసాద్, తమిళ హీరో విష్ణు విశాల్ కరోనా బారిన పడినట్లు తెలిసింది. ఆ తర్వాత టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా కరోనా బారిన పడినట్లు ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు.  



"గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉంటున్నాను. తాజాగా నాకు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నాకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి. కానీ, నా కుటుంబ సభ్యులకు నెగెటివ్ గా వచ్చింది. నేను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. మీరూ కూడా ప్రయాణాలు చేసేప్పుడు ఒకసారి ఆలోచించండి. అందరూ సురక్షితంగా ఉండండి" అని నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. 


అయితే బండ్ల గణేష్ కరోనా బారిన పడడం ఇది మూడోసారి. కరోనా సంక్షోభం ఏర్పడిన మొదటి వేవ్ లో తొలిసారి కరోనా బారిన పడ్డారు బండ్ల గణేష్. ఆ తర్వాత రెండో వేవ్ సమయంలో మరోసారి కరోనా బారిన పడగా.. అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళన కరంగా మారింది. బండ్ల గణేష్ ఇలా వరుసగా మూడు సార్లు కరోనా బారిన నేపథ్యంలో వైరస్ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  


Also Read: Trisha tests positive for Covid : త్రిషకు కోవిడ్ పాజిటివ్.. వారం రోజులుగా నరకం.. అక్కడ ఇరుక్కపోయిన హీరోయిన్!


Also Read: Rajendra Prasad: కరోనాతో ఆసుపత్రిలో చేరిన నటుడు రాజేంద్ర ప్రసాద్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook