Radheshyam movie: పాన్ ఇండియా స్టార్‌గా మారిన టాలీవుడ్ నటుడు రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్..పోస్టర్లు ఒకదాని తరువాత ఒకటి విడుదలవుతూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పుడు మరో పోస్టర్ విడుదలై అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి..పాన్ ఇండియా మూవీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన నటుడు ప్రభాస్(Prabhas). ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్. పీరియాడికల్ యాక్షన్ డ్రామా నేపధ్యంతో రాధాకృష్ణ కుమార్ ఈ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ప్రభాస్-పూజాహెగ్డే (Pooja hegde)లకు సంబంధించిన పలు రొమాంటిక్ సన్నివేశాల్ని ఒకదాని తరువాత ఒకటిగా విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో సినిమా పట్ల అంచనాల్ని పెంచుతున్నారు. ప్రేక్షకుల్నించి మంచి స్పందన లభిస్తోంది. దాంతో శివరాత్రి సందర్బంగా మరో సర్‌ప్రైజింగ్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. 


ఈ పోస్టర్‌‌లో ప్రభాస్‌, పూజాహెగ్డెలు మంచులో పడుకుని  ప్రేమ మైకంలో తెలుతున్నట్లుగా ఉన్నారు. ప్రభాస్‌ షేర్‌ చేసిన ఈ రోమాంటిక్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. కొందరు దీనిని పిచ్చి అంటారు.. మేం మాత్రం ప్రేమ అంటాం..ఈ ప్రేమకథ మీ హృదయాలలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుంది అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. రాధేశ్యామ్(Radheshyam)‌లో ప్రభాస్‌ సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఓ రొమాంటిక్ పాత్రలో ప్రభాస్ అభిమానులను ఆకట్టుకోనున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న రాధేశ్యామ్‌ జూలై 30 వ తేదీన పలు భాషల్లో విడుదల కానుంది. 


Also read: Madhuri Dixit: నీలిరంగు చీరలో...మాధురీ దీక్షిత్ ఎంత అందంగా ఉందో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook