Ram Pothineni- Puri Jagannadh movie Update: ఎనర్జీటిక్ స్టార్ రామ్-స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. దీనికి డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ మూవీని 2024 మార్చి 08న రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా సోమవారం అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి జగన్నాథ్, రామ్, ఛార్మి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్రబృందం. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 హీరో రామ్ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ స్టార్ హీరో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. రామ్ కు జోడిగా శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు లైగర్ డిజాస్టర్ తర్వాత మరే ఏ సినిమాను చేయలేదు పూరీ. దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కిన విజయ్ దేవరకొండ లైగర్ పూరీ టీమ్ కు భారీ నష్టాలను మిగిల్చింది. అప్పటి నుంచి సినిమా చేయని పూరీ ఇటీవల డబుల్ ఇస్మార్ట్ ప్రకటించారు. చాలా రోజులగా సరైన హిట్ లేని రామ్, పూరీ ఇద్దరూ ఈ మూవీతోనైనా సాలిడ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2019లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 


Also Read: Raviteja: ఇట్స్ అఫీషియల్... నాలుగోసారి ఆ స్టార్ డైరెక్టర్‎తో మాస్ మహారాజా..!


Also Read:Shahrukh Khan Jawan Prevue: జవాన్ ట్రైలర్ విడుదల.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న షారూఖ్ ఖాన్ లుక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook