నాగ్ హీరోగా నటించిన ఆఫీసర్ సినిమా డిజాష్టర్ అవడంతో కొంత గ్యాప్ తీసుకున్న ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి దర్శకుడిగా కాకుండా ప్రజెంటర్‌గా మారి సమర్పిస్తున్న భైరవగీత సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజైంది. ధనంజయ, ఇర్రా జంటగా నటించిన ఈ సినిమాతో సిద్ధార్ధ అనే ఓ కొత్త దర్శకుడు పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.