Sai Dharam Tej: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా తన ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్(Tweet) వేశారు. ఆల్ ఈజ్ వెల్ అంటూ థంబ్ సైన్ చూపించారు. కష్టసమయంలో అభిమానులు, ఆప్తులు, స్నేహితులు చూపించిన ప్రేమ, అభిమానానికి 'థాంక్స్' అనే పదం చిన్నదవుతుందని పేర్కొన్నాడు. తన రిపబ్లిక్ మూవీని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. త్వరలో అందర్నీ కలుస్తానంటూ ట్వీట్ ముగించాడు. దీంతో మెగా ఫ్యాన్స్(Mega fans) సంబరాలు చేసుకుంటున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి మాదాపూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తూ.. తేజ్(Sai Dharam Tej) స్కిడ్‌ అయి  పడిపోయారు. స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్‌‌లో షిఫ్ట్ చేశారు. అక్కడ చికిత్స అనంతరం.. కాలర్ బోన్ ఫ్యాక్చర్‌‌‌కు డాక్టర్ల టీమ్ సర్జరీ చేసింది. కాగా అప్పట్నుంచి డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఆస్పత్రిలో ఉంటున్నాడు తేజ్.


Also Read: Republic Movie Review: సాయి ధరమ్ తేజ్ నటించిన "రిపబ్లిక్" మూవీ రివ్యూ


అయితే, ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ స్పందించకపోవడంతో.. అతడి ఆరోగ్యం ఎలా ఉందనే ఆందోళన అభిమానుల్లో ఉంది. ప్రమాదం జరిగిన దాదాపు మూడు వారాల తర్వాత సాయి ధరమ్ తేజ్ తమ అభిమానులను ట్విట్టర్(Twitter) ద్వారా పలకరించటంతో..అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోయింది.  సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా(Republic Movie) ఇటీవలే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook