Mega Fan Ravuri Pandu Death మెగా అభిమాని, భీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రావూరి పండు (27) గుండె పోటుతో మరణించాడు. క్రికెట్ ఆడూత కుప్పకూలిపోయిన ఈ ఘటనతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తన అభిమాని మరణించడంతో సాయి ధరమ్ తేజ్ కదిలిపోయాడు. అభిమాని మృతికి సంతాపం తెలియజేస్తూ.. తన కొత్త సినిమా విరూపాక్ష టీజర్ లాంచ్‌ను వాయిదా వేశాడు. నేడు రావాల్సిన ఈ టీజర్ రావడం లేదని ప్రకటించారు. మళ్లీ కొత్త డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ఈ మేరకు మేకర్లు ఓ ట్వీట్ వేశారు. భీమవరం సాయి ధరమ్ తేజ్ అభిమాన సంఘం అధ్యక్షుడు రావూరి పండు అకాల మరణం మమ్మల్ని ఎంతగానో బాధిస్తోంది.. షాకింగ్‌గా ఉంది. ఆయనకు నివాళిగా, సంతాపంగా నేడు విడుదల చేయాల్సిన విరూపాక్ష టీజర్‌ను పోస్ట్ పోన్ చేస్తున్నామని ప్రొడక్షన్ కంపెనీ ట్వీట్ వేసింది.


 



 


విరూపాక్ష టీజర్‌ను నిన్ననే పవన్ కళ్యాణ్‌కు చూపించారు. వినోదయ సిత్తం సినిమా సెట్‌కు విరూపాక్ష టీం వచ్చింది. స్పెషల్‌గా పవన్ కళ్యాణ్‌కు టీజర్‌ను చూపించారు. టీజర్ బాగుందని దర్శక నిర్మాతలను మెచ్చుకున్నాడు. ఇక ఈ టీజర్‌ను నేడు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇంతలోనే ఇలాంటి విషాద వార్త వినాల్సి వచ్చింది. అభిమాని మరణం పట్ల తీవ్ర దుఃఖంలో ఉండటంతో నేడు రావాల్సిన విరూపాక్ష టీజర్‌ను వాయిదా వేశారు.


సాయి ధరమ్ తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులున్నాయి. అందులో విరూపాక్ష ఒకటి. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న వినోదయ సిత్తం రీమేక్ షూట్ ఈ మధ్యే ప్రారంభం అయింది. ఈ రెండు సినిమాలతో ఈ ఏడాది సాయి ధరమ్ తేజ్ సందడి చేయబోతోన్నాడు.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook