అలనాటి నటుడు శశికపూర్ ఇటీవలే మరణించిన క్రమంలో ఆయనకు ఇప్పటికే ఎందరో ప్రముఖులు నివాళులు అర్పించారు. అయితే "అమూల్"  కాస్త వినూత్నమైన రీతిలో ఆ సహజ నటుడికి నివాళులు అందివ్వాలని సంకల్పించింది. అందుకే దీవార్ సినిమాలో శశికపూర్ చెప్పిన ప్రముఖ డైలాగ్ "మేరే పాస్ మా హై"ను "మేరే పాస్ ఆప్కా సినిమా హై"గా మార్చి ఆ డైలాగ్ శశికపూర్ చెబుతున్నట్లుగా ఒక క్యారికేచర్ వేయించింది అమూల్ సంస్థ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఆ క్యారికేచర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీవార్ సినిమాలో అమితాబ్ తమ్ముడిగా నటించిన శశికపూర్‌కు ఆ పాత్ర తెచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఒక సిన్సియర్ పోలీస్ అధికారిగా హంతకుడైన తన అన్నను ఎదిరించే క్రమంలో శశికపూర్ పలికిన ఆ డైలాగ్ చాలా మంది మన్ననలను అందుకుంది. ముంబయి పోలీస్ వారు కూడా శశికపూర్‌కి ట్విటర్ ద్వారా వినూత్నంగా నివాళులు అర్పించారు. నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన చూపించిన నటనను ప్రశంసించారు.