Bigg Boss Season 07 Updates: బిగ్ బాస్ సీజన్ ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ముందుగా అనుకున్నట్లే ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అయింది. ఐదో వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి పట్టుమని రెండు వారాలు కూడా ఉండకుండానే హౌస్ నుంచి బయటకు వెళ్లింది. సెప్టెంబరు 03న ప్రారంభమైన బిగ్ బాస్ ఏడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి కిరణ్‌ రాథోడ్‌, షకీలా, దామిని భట్ల, రతికా రోజ్‌, శుభ శ్రీ, నయని వెళ్లిపోగా.. తాజాగా పూజామూర్తి వెళ్లిపోయింది. అందరి కంటే తక్కువ ఓట్లు ఈ బ్యూటీకి వచ్చాయి. ఏడో వారం కూడా అమ్మాయే వెళ్లిపోవడంతో షో పై నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వీకెండ్ ఎపిసోడ్ లో రతికా రోజ్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత వారం నామినేషన్స్ ఏడుగురు ఉన్నారు. వీరిలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజా, భోలే షావళి, అశ్విని, పూజా మూర్తి ఉన్నారు. అయితే చివరి రెండు స్థానాల్లో అశ్వినీ, పూజామూర్తి ఉన్నారు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా సీరియల్ బ్యాచ్ తో కలిసిపోవడం, టాస్కులు సరిగ్గా ఆడకపోవడం వంటి కారణాల ఈమెపై నెగిటివిటీ పెరిగిపోయింది. దీంతో ఈ అమ్మడును రెండు వారాలకే హౌస్ నుంచి పంపించేశారు ఆడియెన్స్. నిజం చెప్పాలంటే ఈ సీరియల్ నటి సెప్టెంబరు 03న హౌస్ లోకి రావాల్సి ఉంది. ఈమె తండ్రి చనిపోవడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రావాల్సి వచ్చింది. ఈమె రెండు వారాలకు కలిపి కేవలం రూ. 3 లక్షలు మాత్రమే తీసుకుందని టాక్ వినిపిస్తోంది. అంటే వారానికి రూ.1.5 లక్షలన్న మాట. దీంతో బిగ్‌ బాస్‌లో అతి తక్కువ రెమ్యునరేషన్‌ తీసుకున్న కంటెస్టెంట్‌గా పూజా మూర్తి నిలిచింది.


Also Read: Vijay Leo: లియో సినిమా ఫ్లాష్ బ్యాక్ నిజం కాదా? షాకింగ్ ట్విస్ట్ రివీల్ చేసిన సినిమాటోగ్రాఫర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook