Aadavallu Meeku Joharlu Trailer: శర్వానంద్-రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విడుదలైన కొద్దిసేపటికే ఈ ట్రైలర్‌కు 4 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. 'ప్రేక్షకులారా రండి.. మీ దీవెనలు అందించండి..' అంటూ శర్వానంద్ ఈ ట్రైలర్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రైలర్‌లో సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 'ఏ అమ్మాయినైనా ఫస్ట్ మీరు వచ్చి చూస్తే.. సెంటిమెంటుగా వెంటనే మంచి సంబంధం కుదురుతుంటగా..', 'ఆ అమ్మాయి కూడా నచ్చలేదా...' వంటి డైలాగ్స్ కనెక్టింగ్‌గా ఉన్నాయి. ఇక రైల్వే స్టేషన్‌లో పెళ్లి చూపుల సీన్ ట్రైలర్‌లో హైలైట్ అయింది. ఈ సినిమాతో డైరెక్టర్ తిరుమల కిశోర్, హీరో శర్వానంద్‌లకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


నిజానికి ఫిబ్రవరి 25నే ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అదే రోజున 'భీమ్లా నాయక్' థియేటర్లలోకి రావడంతో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రం వాయిదా పడక తప్పలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కి ఈ సినిమాతో అయినా హిట్ దొరుకుతుందా లేదా వేచి చూడాలి. 




Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి రోజు ఏ నైవేద్యం పెట్టాలి.. ఏది పెడితే ఆ పరమ శివుడి అనుగ్రహం పొందగలరు..


Also Read: Russia Ukraine War: బెలారస్ వేదికగా చర్చలకు సిద్ధమైన రష్యా, ఉక్రెయిన్... యుద్ధానికి తెరపడేనా..?


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook