విమర్శలకు దూరంగా ఉండే  సింగర్ సునీత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. సింపుల్ గా, సుత్తి కొట్టకుండా  చెప్పాల్సింది చెప్పి పేస్ బుక్ లో పోస్ట్ చేసేశారు. ఇప్పుడా పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రభుత్వానికి చురకలు అంటే విధంగా ఉంటుంది ఆ పోస్ట్. సునీత పేస్ బుక్ లో పోస్ట్ చేసింది ఇది.


"ట్రంప్ కూతురు ఇవాంకా రాయదుర్గం-ఖాజా గూడా రోడ్డు మీద రావటం లేదా? వస్తే బావుండు.. "అని చెప్పాల్సింది చెప్పేసింది. ఇవాంకా హైదరాబాద్ కు వస్తున్న వేళ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సమయంలో సునీత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.