Mithunam Producer Death మిథునం సినిమాతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్న మొయిద ఆనందరావు నేడు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఆయన స్వగ్రామం విజయనగరం జిల్లాలోని రేగిడి మండలం వావిలవలస.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్‌గా నిలుస్తుంది. ఎస్పీబీ, శ్రీలక్ష్మీ నటన, తనికెళ్ల భరణి దర్శకత్వం, మాటలు పాటలు ఇలా ప్రతీ ఒక్క విషయంలో మిథునం అందరినీ కదిలిస్తుంది. ముందుగా ఈ సినిమాలో ఎల్బీ శ్రీరామ్‌ను హీరోగా పెట్టి తీయాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఎస్పీబీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.


మిథునం సినిమాకు ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి. అలాంటి మంచి నిర్మాత నేడు కన్నుమూయడంతో ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.


Also Read:  Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్‌ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!


Also Read: Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. అదరహో అనాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook