Tollywood: సూపర్‌స్టార్ మహేశ్ బాబు సినిమా..సర్కారు వారి పాట భారీ విజయంతో దూసుకుపోతోంది. త్వరలో మాస్ దర్శకుడి సినిమాకు మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకడు మహేశ్ బాబు. పరశురామ్ దర్శకత్వంలో..కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన సర్కారు వారి పాట సూపర్‌హిట్ టాక్‌తో మహేశ్ బాబు క్రేజ్ మరింతగా పెరిగింది. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేశ్ బాబు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. తమన్ మరోసారి మహేశ్ సినిమాకు సంగీతం అందించనున్నాడు. ఇంకోవైపు బాహుబలి దర్శకుడు రాజమౌళితో కూడా మహేశ్ బాబు మరో సినిమా చేయనున్నాడు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. 


ఇప్పుడు మహేశ్ బాబు త్వరలో మాస్ దర్శకుడితో సినిమా చేయనున్నాడని సమాచారం. మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని మహేశ్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. క్రాక్ సినిమాతో సూపర్‌హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలకృష్ణతో సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా అనంతరం..మహేశ్ బాబుతో సినిమా చేయవచ్చని తెలుస్తోంది. మహేశ్ బాబుతో సినిమా తన కల అని గోపీచంద్ వ్యాఖ్యానించిన పరిస్థితి. మహేశ్ బాబు కూడా ఓకే చెప్పేసినట్టే తెలుస్తోంది. 


Also read: Kajol Re-entry: త్వరలోనే సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనున్న కాజోల్ ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook