Yatra 2 Movie Collections:  2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. అందుకోసం సినిమాలను ఓ ఆయుధంగా వాడుకుంటున్నారు.ఈ రూట్లనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల అడ్డుకోవడానికి అవసరమైన అన్ని మార్గాల్లో ప్రయత్నించి ఒకింత సక్సెస్ అయిందనే చెప్పాలి. అటు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా ఈ సినిమాను మళ్లీ రీ సెన్సార్ చేయమని ఆదేశించింది. తాజాగా ఈ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సంగతి పక్కన పెడితే.. 'యాత్ర 2' అంటూ  వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో తెలుగు వాళ్లు తమిళ, మలయాళ నటులు నటించారు. తెలుగు వాళ్లు ఎవరైనా నటిస్తే.. వారికి ఇక భవిష్యత్తు ఉండదనే కారణంతో పెద్ద నటులు ఎవరు ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. ఈ శుక్రవారం విడుదలైన యాత్ర2లో మమ్ముట్టి .. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తే.. తమిళ నటుడు జీవా వై.యస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలో యాక్ట్ చేసారు.


ఈ నెల 8న విడుదలైన ఈ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత హై కమాండ్ నుంచి పాదయాత్ర చేయకూడదంటూ ఆదేశాలు. వాటిని ధిక్కరించి పాదయాత్ర చేసి పొలిటికల్ లీడర్‌గా ఎలా ఎదిగాడు. ముందుగా ప్రతిపక్ష నేత.. ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడానికి తండ్రిలా పాద యాత్ర ఎలా ఉపయోగపడిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.


పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యాంగిల్‌లో తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని నిజాలు.. మరికొన్ని సినిమాటిక్ కల్పితాలున్నాయనేది ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా విడుదల రోజున చేసిన హడావుడి ఆ తర్వాత పూర్తిగా చల్లబడింది. ఈ సినిమా పూర్తిగా సీరియస్‌గా సాగడం.. కమర్షియల్ అంశాలకు దూరంగా కాస్త డ్రామాటిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.80 కోట్ల షేర్ (రూ. 5.70 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఓన్ రిలీజ్ చేసుకున్నారు. రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఓవరాల్‌గా ఎంత రాబడుందనేది చూడాలి. వీకెండ్ దాదాపు ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిందనే చెప్పాలి. ఓవరాల్‌గా టాక్ బాగున్నా.. సినిమా పూర్తిగా వన్ సైడ్‌గా ఉండటం వంటివి యాత్ర 2కు ప్రతికూలంగా మారాయి. ఈ సినిమాలో నటించిన మమ్ముట్టికి పారితోషకం కింద రూ. 20 కోట్లు.. జీవాకు రూ. 10 కోట్లు.. మిగతా నటీనటులకు కలిపి రూ. 5 కోట్లు దాకా ఖర్చు అయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఏదైనా డబ్బులు వస్తే గిస్తే.. డిజిటల్, శాటిలైట్ రూపేణా రావాల్సిందే. ఏది ఏమైనా ఎంతో అట్టహాసంగా ఎన్నికల అస్త్రంగా మలిచిన ఈ సినిమా థియేట్రికల్‌గా ఫెయిల్ అయినా.. ఓటీటీ వేదికగా ఎలాంటి సంచలనం రేపుతుందనేది చూడాలి.


Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook