తనుశ్రీ దత్తా-నానా పటేకర్‌ వివాదం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నానా పటేకర్‌ 2008లో ‘హర్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ సందర్భంగా తనను లైంగికంగా వేధించారని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  పలువురు హీరోయిన్లు, నటులు తనుశ్రీకి మద్దతుగా నిలవగా, మరికొందరు పాటేకర్‌పై ఆమె చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎట్టకేలకు తనుశ్రీ వ్యాఖ్యలపై నానా పాటేకర్ స్పందించారు. తనుశ్రీ తనపై చేసిన ఆరోపణలకు ఆయన బదులిస్తూ.. 'అబద్దం ఏదైతే ఉందో.. అది అబద్దమే' అని కుండబద్దలుకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.


తనుశ్రీ వ్యాఖ్యలపై ఇటీవలే సీనియర్ నటుడు శక్తికపూర్ స్పందించారు. 'నేను నిన్ననే విదేశాల నుంచి వచ్చాను. నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు. అది పదేళ్ల కిందటి సంగతి. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని' అని చెప్పగా..ఆయన వ్యాఖ్యలపై కొందరు మండిపడ్డారు.


సోనం కపూర్‌, ట్వింకిల్‌ ఖన్నా, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, అనుష్క శర్మ వంటి పలు నటీనటులు తనుశ్రీకి మద్దతు తెలపగా, అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి నటులు ఈ వివాదంపై ముందుకు వచ్చి స్పందించేందుకు నిరాకరించారు.


మరోవైపు..గతంలో పటేకర్‌ గురించి నటి డింపుల్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  ‘నాకు తెలిసి అతడు దుర్మార్గుడు. అతడు గొప్ప నటుడే. వ్యక్తిగతంగా అతడు చాలా స్నేహంగా ఉంటారు. కానీ అతడి జీవితంలో ఓ చీకటి కోణం కూడా ఉంది. నటుడిగా అతడిపై నాకున్న అభిప్రాయం ఇది’ అని కుండలు బద్ధలు కొట్టింది.