నాగ్ హీరోగా నటించిన ఆఫీసర్ సినిమా డిజాష్టర్ అవడంతో ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్ తీసుకున్న ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి దర్శకుడిగా కాకుండా ప్రజెంటర్‌గా ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్న సినిమా భైరవగీత. అరవింద సమేత సినిమాకు పోటీగా ఈ సినిమాను రిలీజ్ చేస్తానన్న వర్మ.. అప్పుడు తన ప్లాన్‌ని వాయిదా వేసుకుని తాజాగా నవంబర్ 22న రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ధనంజయ, ఇర్రా జంటగా నటించిన ఈ సినిమాతో సిద్ధార్ధ అనే ఓ కొత్త దర్శకుడు పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఓ యదార్ధగాధ ఆధారంగా తెరకెక్కింది. త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మరో థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.