టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేయనున్నట్టు భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కన్ఫర్మ్ చేశాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని గతేడాది కాలంగా వార్తలొస్తున్నాయి కానీ ఎప్పుడూ, ఎవ్వరూ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఎప్పటికప్పుడు అటు మహేష్ బాబు అభిమానులకు, ఇటు బోయపాటి చిత్రాలను నచ్చే ఆడియెన్స్‌కు నిరాశే ఎదురవుతూ వస్తోంది. అయితే, ఉన్నట్టుండి తాజాగా వినయ విధేయ రామ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న బోయపాటి.. తన తర్వాతి ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ మహేష్ బాబుతో సినిమా ఉంటుందని స్పష్టం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితోనూ సినిమా ఉంటుందన్న బోయపాటి.. అంతకన్నా ముందుగా మహేష్‌తోనే సినిమా చేయనున్నట్టు ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా చేస్తోన్న సూపర్ స్టార్.. ఈ సినిమాలోనూ శ్రీమంతుడి తరహా పాత్రలో నటిస్తున్నట్టు టాక్. ఊపిరి మూవీ తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే.  


ఇదిలావుంటే, బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబోలో భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన వినయ విధేయ రామ మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు లభించాయి. ఏదేమైతేనేం.. ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అవేవీ వినయ విధేయ రామ మూవీ కలెక్షన్స్ ఆపలేకపోయానని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.