మెగాస్టార్‌ చిరంజీవి చేసిన ఓ ట్వీట్ (Chiranjeevi`s tweet) ఇప్పుడు ఆయన అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య మూవీలో (Aacharya) నటిస్తున్న చిరంజీవి.. ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండగానే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొనిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్‌‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై రామ్‌ చరణ్‌, నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకు చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరు సరసన నటించిన కాజల్‌ అగర్వాల్ ఆచార్య మూవీలో మరోసారి ఆయనతో జోడీ కడుతోంది. ఈ సినిమా గురించి చెప్పుకోదగిన మరో ప్రత్యేకమైన అంశం ఏంటంటే.. చిరంజీవి సినిమాకు దాదాపు 14 ఏళ్ల తర్వాత మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. Also read : మాతో క్రికెట్ ఆడండి.. డబ్బులు సంపాదించుకోండి: బీసీసీఐ



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


 



ఆచార్య మూవీ మేటర్ కాసేపు పక్కనపెడితే.. తాజాగా చిరంజీవి చేసిన ట్వీట్ ఏంటనే విషయానికొస్తే.. '' సాధారణంగా సినిమాల్లో పాటలు చిత్రీకరించే సమయంలో తాను పాటలను గ్యాప్ లేకుండా ఎంజాయ్ చేస్తానని... కానీ ఇటీవల ఓ పాటను మాత్రం పాజ్‌ చేస్తూ మళ్లీ రెజ్యూమ్ చేస్తూ మళ్లీమళ్లీ వింటున్నానని చిరంజీవి ట్వీట్ చేశాడు. అందుకు గల కారణం ఏంటనేది తెలియాలంటే.. రేపు (మంగళవారం) ఉదయం 9 గంటలకు వెల్లడిస్తానని మాత్రమే చెప్పడం చిరంజీవి అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. Also read : Mahesh Babu: మహేష్ బాబు ట్వీట్‌కి భారీ స్పందన


పాటల చిత్రీకరణ సమయంలో తాను మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తాను అని చిరంజీవి చేసిన ట్వీట్ ప్రకారం ఆలోచిస్తే... మంగళవారం ఉదయం 9 గంటలకు చిరు చెప్పబోయే ఆ విషయం ఆచార్య సినిమాకు సంబంధించినదే అయ్యుంటుందని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. ఆచార్య పాటలు అనే ఆలోచన వస్తే చాలు... మణిశర్మ-చిరంజీవి కాంబోలో రానున్న ఆ పాటలు ఎలా ఉంటాయో వినితీరాల్సిందేననే కోరికను వ్యక్తంచేయకుండా ఉండలేకపోతున్నారు. మరి చిరు అభిమానులు అంచనా వేసుకుంటున్నట్టుగా మంగళవారం ఉదయం 9 గంటలకు ఆచార్య మూవీ నుంచి ఏమైనా స్నీక్ పీక్ (Aacharya sneak peek) రిలీజవుతుందేమో వేచిచూడాల్సిందే మరి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..