ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం "భరత్ అను నేను". ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్స్ ఇటీవలి కాలంలో విడుదలయ్యాయి. అంత కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే..ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గీతం "ఐడోంట్ నో" అనే సాంగ్‌ను ఏప్రిల్ 1వ తేదిన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే ఈ పాటను పాడిన వ్యక్తి ఎవరో తెలుసా.. ఆయన ఎవరో కాదు...!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ నటుడు మరియు దర్శకుడు ఫ‌ర్హాన్ అక్తర్. ఇటీవలే ఈ విషయాన్ని ఫ‌ర్హాన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ మహేష్ బాబు, ఫ‌ర్హాన్‌కి ట్విటర్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు. ఈ పాటను స్పెయిన్‌లో చిత్రీకరించారు. "భరత్ అను నేను" చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ఏప్రిల్ 7వ తేదిన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. 


మహేష్ బాబు, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న "భరత్ అను నేను" చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. శరత్‌ కుమార్, ప్రకాష్ రాజ్‌, దేవరాజ్‌, పోసాని కృష్ణమురళి, ఆమని, సితార, రవిశంకర్, జీవా, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఓ ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది.