హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి తొలిసారి జంటగా కలిసి నటించిన సినిమా పడిపడి లేచే మనసు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా  నిర్మాతలు ఈ సినిమా నుంచి కల్లోలం అనే పాటను విడుదల చేశారు. క్రిష్ణ కాంత్ రచించిన పాటను విశాల్ చంద్రశేఖర్ కంపోజిషన్‌లో అనురాగ్ కులకర్ణి పాడిన ఈ మెలోడి సాంగ్ ఇక్కడ మీ కోసం.