హైదారబాద్: మహర్షి మూవీ నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు‌పై ఐటీ అధికారులు కన్నేశారు. ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బృందంగా ఏర్పడిన ఐటీ అధికారులు .. అమీర్‌పేట శ్రీనగర్‌ కాలనీలోని  దిల్‌రాజు కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ బడ్జెత్ తో మహర్షి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని నిర్మించిన వారిలో దిల్ రాజు ఒకరు.  కాగా దిల్‌రాజుతో పాటు పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ), అశ్వనీదత్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.


కాగా మూవీ రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఈ ఈ దాడులు నిర్వహించడం గమనార్హం. దిల్ రాజుపై ఐటీ కన్నేయడానికి కారణం మహర్షి మూవీలో ఆయన పెట్టిన భారీ పెట్టుబడులే కారణమనే టాక్ వినిపిస్తోంది.