సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిక మహర్షి కలెక్షన్ల వసూళ్లలో సరికొత్త రికార్డుల వైపు పయనిస్తోంది. ప్రస్తుతం నైజాంలో మహిర్షి మూవీ సరికొత్త రికార్డు దిశగా దూసుకెళ్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమా నైజాంలో 20 కోట్ల క్లబ్ లో చేరింది. ఫస్ట్ వీకెండ్ వసూళ్లలో నాన్-బాహుబలి రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా... ఇప్పుడు 20 కోట్ల క్లబ్ లో కూడా చేరడంతో మరో రికార్డు సృష్టించినట్టయింది.


నైజాంలో ఈ సినిమాకు నిన్న కోటి 53 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ మొత్తంతో విడుదలైన 6 రోజుల్లో 20 కోట్ల రూపాయల షేర్ సాధించింది మహర్షి. ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి ఈ సినిమా నైజాంలో 30 కోట్ల షేర్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. మరో 2 వారాల పాటు ఈ సినిమా హవా కొనసాగే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.