ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. జగన్‌ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించి అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్టు మహేశ్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కేంద్రంలోనూ తిరుగులేని మెజారిటీతో గెలుపొందిన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా మహేశ్‌ బాబు కంగ్రాట్స్ చెప్పారు. మీ నాయకత్వంలో దేశం మరిన్ని విజయాలు అందుకుంటూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నట్టు మహేశ్ బాబు ట్విటర్ ద్వారా స్పష్టంచేశారు.

వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోదీలకు కంగ్రాట్స్ చెబుతూ మహేష్ బాబు చేసిన ట్వీట్స్‌కి సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి రిట్వీట్స్, లైక్స్ రూపంలో భారీ స్పందన కనిపించింది.