అన్నయ్యను తమ్ముడు కలిస్తే తప్పేంటి అనుకునేరు.. ఇంకెవరో కలిస్తే విషయం ఏముండదు కానీ..అన్న మెగాస్టార్ చిరును తమ్ముడు పవన్ స్టార్ కల్యాణ్ కలిస్తే అది వింతే....చాలా గ్యాప్ తర్వాత అన్నయ్య చిరంజీవిని  కలిసేందుకు వచ్చిన పవన్ కల్యాణ్ రావడం..దాన్ని సోషల్ మిడియాలో నాదెండ్ల షేర్ చేసుకోవడంతో ఈ విషయం బయటికి వచ్చింది. అన్నదమ్ములు కలిసిన సందర్భం ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సైరాతో జనసేనాని భేటీ


స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా చిరంజీవి హీరోగా తెరపైకి వస్తున్న `సైరా`  చిత్రం విడుదలౌతున్న అక్టోబర్ రెండో తేదీన ప్రేక్షకుల ముందు వస్తోంది. ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పందుకు మెగాస్టార్ చిరంజీవిని ఆయ‌న త‌మ్ముడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఆ పార్టీ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ క‌లిశారు. చిరంజీవితో స‌మావేశ‌మైన విష‌యాన్ని నాదెండ్ల మ‌నోహ‌ర్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.


నాదెండ్ల మనసులో మాట


ఈ సందర్భంగా ముగ్గురు దిగిన సెల్ఫీ ఫోటో ట్విట్టర్ లో షేర్ చేసిన నాదెండ్ల...``సైరా` న‌ర్సింహారెడ్డి తో  ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నేను మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు . ఈ భేటీలో చాలా విష‌యాలు మాట్లాడుకున్నామని తెలిపారు. చిరు జీవిత ప‌య‌నం తమకెంతో స్ఫూర్తి క‌లిగించిందని....సైరా మూవీ  గొప్ప విజ‌యం సాధించాలని తాము ఆశిస్తున్నామన్నారు. చివరికగా ఇలాంటి మ‌రెన్నో స‌మావేశాల్లో చిరుతో క‌లిసి పాల్గొనాల‌ని కోరుకుంటున్నాం` అంటూ నాదెండ్ల మ‌నోహ‌ర్ ట్వీట్ చేశారు.