దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ పేరు సంపాదించుకున్న నటీమణి ప్రియమణి. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లోనే తన నటనతో మెప్పించి జాతీయ అవార్డు సైతం కొల్లగొట్టింది. నటనతో పాటు డ్యాన్స్‌తోనూ ఆమె ఫేమస్ అయింది. దక్షిణాది నుంచి ఉత్తరాది బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా తన లక్ పరీక్షించుకుంది ఈ బ్లాక్ బ్యూటీ. అయితే కొన్నేళ్ల కిందట జరిగిన ఓ వివాదం గురించి తాజాగా ఆమె వివరణ ఇవ్వగా ఆ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 
ఏపీలో కరోనా వాలంటీర్ పోస్టులు.. ముందుకొస్తే ఓ ఆఫర్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) జరుగుతున్న సమయంలో ఓ క్రికెటర్ ప్రియమణితో అసభ్యంగా ప్రవర్తించగా.. చెంపదెబ్బతో అతడికి బుద్ధి చెప్పిందంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. తాజాగా ఈ వదంతులకు నటి చెక్ పెట్టేసింది. సీసీఎల్ ఓ సీజన్‌లో తాను ఈవెంట్‌కు హాజరుకాగా, తన ఫోన్ ఎవరో చోరీ చేశారని తెలిపింది. ఆ క్రికెటర్ ప్రాంక్ కాల్ చేయడంతో పాటు ఇబ్బందులకు గురిచేశాడని వెల్లడించింది. ఈ క్రమంలో తన హోటల్ రూమ్‌కు వచ్చిన సమయంలో అతడి ప్రవర్తించిన తీరు సరిగా లేదని అభిప్రాయపడింది.  
ఏపీలో కరోనా కేసులు, మరణాలు.. పూర్తి వివరాలు


ఈ పద్ధతి మార్చుకోవాలని ఆ వ్యక్తిని నేరుగా సూచించడం నిజమేనని ఒప్పుకుంది. అయితే క్రికెటర్‌ను తాను చెంపదెబ్బ కొట్టినట్లుగా వస్తున్న కథనాలలో నిజం లేదంటోంది. ప్రవర్తన నచ్చలేదని మాత్రమే హెచ్చరించానని, కొట్టడం లాంటివి చేయలేదని స్పష్టం చేసింది ప్రియమణి. అయితే తనను ఏడిపించిన ఆ క్రికెటర్ మాత్రం చెప్పడానికి ఆమె నిరాకరించారు. ప్రస్తుతం ఆమె వెంకటేష్‌తో నారప్ప, బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ మైదాన్‌ మూవీలో నటిస్తోందని తెలిసిందే. డ్యాన్స్ షోలకు జడ్జీగా కూడా వ్యవహరిస్తోంది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photo