బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట పెళ్లికి రెడీ అయ్యారు. గతకొంతకాలంగా బాలీవుడ్ నటులు రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణెలు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం ఈ ఏడాది నవంబర్ 12-16 తేదీల్లో జరగనుందని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ దినపత్రిక డీఎన్ఏ తన కథనంలో పేర్కొంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన ఈ జంట.. ఇటలీలో పెళ్లి చేసుకోనుంది. మీడియాకి దూరంగా.. పరిమిత సంఖ్యలో కుటుంబీకులతో పాటు షారుఖ్ ఖాన్, అర్జున్ కపూర్ సహా కొందరు బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారు. ఇక బంధువులు, స్నేహితుల కోసం ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



 


గతంలో ఇదే తరహాలో రహస్యంగా క్రికెటర్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు మీడియాకి దూరంగా ఇటలీలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రణ్‌వీర్-దీపికల నిశ్చితార్థం రహస్యంగా మాల్దీవుల్లో జరిగిందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ ఈ వార్తని అటు దీపక ఫ్యామిలీ గానీ, రణ్ వీర్ ఫ్యామిలీ కానీ ఖండించలేదు. ఆ తర్వాత పెళ్లి గురించి బోలెడన్ని వార్తలు వచ్చాయి. అయినా దీపిక గానీ, అటు రణ్‌వీర్ గానీ పెళ్లిపై స్పందించలేదు.