హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, అక్కినేని సమంత జంటగా నటిస్తున్న జాను చిత్రం, తమిళ చిత్రం 96కు రిమేక్ గా తెరకెక్కించబోతున్న జాను చిత్రాన్నిదిల్ రాజు నిర్మాణంలో అభిమానుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్, సంగీతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని జాను చిత్రం కోసం ఎదురుచూస్తున్న శర్వా-సామ్ అక్కినేని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా జాను చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉర్రూతలూగిస్తున్న జాను సాంగ్ 


‘ప్రాణం నా ప్రాణం నీతో ఇలా.. తొలి గానం పాడే వేళ’ అంటూ సాగిపోయే తొలిపాట ప్రేమికులకు బాగా కనెక్ట్ అవుతున్నారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్స్  చిన్నయి శ్రీపాద, గౌతమ్ భరద్వాజ్ అద్భుతంగా ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత స్వరాలు సమకూర్చారు. ఈ మెలోడిని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మ్యూజిక్ యూనిట్ ధీమాగా ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..