తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు అందించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు సాధిస్తూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ముందు వరుసలో నిలిచింది. జనవరి 11న రిలీజైన సినిమా .. ఇప్పటికీ సూపర్ డూపర్ కలెక్షన్లతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో మంచి జోష్ లో ఉన్న నిర్మాతలు .. తాజాగా ప్రేక్షకులకు మరో గుడ్ న్యూస్ అందించారు.  నేటి నుంచి ( శనివారం) సరికొత్త కామెడీ సీన్లతో థియేటర్లలో 'సరిలేరు నీకెవ్వరు' మరింత కొత్తగా అలరిస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్ టెయిన్ మెంట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.  దీనికి సంబంధించిన పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా హీరోయిన్ రష్మిక మందన్న జత కట్టింది. మీకు అర్ధమవుతుందా అంటూ సినిమాలో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏకె ఎంటర్ టెయిన్ మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి రీ-ఎంట్రీ ఇచ్చారు.  ఇక సినిమాలో  'ఏంటీ అర్థమవుతుందా',  'నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్', 'రమణా లోడెత్తాలిరా'.. లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..