మొదటిసారిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా వినయ విధేయ రామ. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ సినిమాలో చెర్రీ సరసన భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వాని జంటగా నటిస్తోంది. సినిమా విడుదలకు మరో నెల రోజులే మిగిలి వుండటంతో తాజాగా నిర్మాతలు ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను ఇవాళ విడుదల చేశారు. శ్రీమణి రచించిన పాటతు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన తందానే తందానే పాట నెమ్మదిగా ట్రెండింగ్‌లోకి దూసుకుపోతుంది.