టాలీవుడ్ నటి అనసూయ మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో నటించబోతోంది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్ గా వస్తున్న చిత్రం యాత్ర. ఈ మూవీలో హీరోయిన్ గా అనుసూయ్ చాన్స్ దక్కినట్లు సమాచారం. కర్నూలు జిల్లా నాయకురాలిగా ఉండే ఆ పాత్రకు అనసూయ అయితే సరిగ్గా సరిపోతుందని భావించిన చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించారట.


అనసూయ కూడా ఈ పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి సుహాసిని సబితా ఇంద్రారెడ్డి పాత్రలో నటిస్తుండగా, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, భూమిక మరికొన్ని కీలకపాత్రల్లో కనిపించనున్నారు. కాగా సంక్రాంతికి సినిమా తెరపైకి ఎక్కించాలనే ప్లాన్ చేస్తున్నారు.