'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో బిజీగా ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా విడుదల కాకముందే మరో  చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు.  క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో మరో చిత్రానికి రెడీ అవుతున్నాడు విజయ్. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ముంబైలో జరిగాయి. వీరిద్దరి కాంబినేషన్ లో 'ఫైటర్' సినిమాకు శ్రీకారం చుట్టారు. ముంబైలో జరిగిన పూజా కార్యక్రమాల్లో నటి, నిర్మాత ఛార్మి కూడా పాల్గొంది. పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెండు రోజుల క్రితమే ముంబై చేరుకున్నాడు విజయ్ దేవరకొండ.


Read Also: ప్రేక్షకులను ఊరిస్తున్న RRR చిత్రం విడుదల 
పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై 'ఫైటర్' సినిమా నిర్మాణం జరుగుతోంది. బాలీవుడ్ దర్శక నిర్మాత, హోస్ట్ కరణ్ జోహర్ ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో మొదలు కాకముందే క్రేజీ టాక్ తెచ్చుకుంది. హీరో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ముహూర్తపు షాట్ కు నిర్మాత, నటి ఛార్మి క్లాప్ కొట్టారు. విజయ్ దేవరకొండ టేబుల్ పై కూర్చున్న సన్నివేశానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండ పదో చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు 'ఫైటర్' అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాను వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..