Bone Death Issue: కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న తరువాత ఇప్పుడు బ్లాక్ ఫంగస్‌తో పాటు మరో కొత్త సమస్య వెంటాడుతోంది. పోస్ట్ కోవిడ్‌లో ఇప్పుడు బోన్ డెత్ సమస్య వణికిస్తోంది. అదే అవాస్కులర్ నెక్రోసిస్ స్థూలంగా చెప్పాలంటే ఎముక కణజాలాల మరణం. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్(Corona Virus) నుంచి కోలుకున్నవారిలో మొన్నటి వరకూ బ్లాక్ ఫంగస్ వేధించింది. ఇప్పుడు బ్లాక్ ఫంగస్‌తో పాటు మరో కొత్త సమస్య వెలుగు చూసింది. అదే బోన్ డెత్ సమస్య. అంటే అవాస్కులర్ నెక్రోసిస్ లేదా ఎముక కణజాలాల మరణం. ఇప్పటి వరకూ మూడు బోన్ డెత్ (Bone Death) కేసులు ముంబై నుంచి వెలుగు చూశాయి. రానున్న రోజుల్లో ఈ కేసులు ఎక్కువగా ఉంటాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందూజా ఆసుపత్రిలో కోవిడ్‌కు చికిత్స పొందిన 2 నెలల అనంతరం నెక్రోసిస్ అభివృద్ధి చెందిన ముగ్గురు వ్యక్తులకు చికిత్స అందించారు.


ఈ సమస్య ఎదురైనవారికి తొడ ఎముకలో విపరీతమైన నొప్పి ఉండటంతో పరీక్ష చేసిన వైద్యులు బోన్ డెత్ సమస్యగా గుర్తించారు. అయితే అవాస్కులర్ నెక్రోసిస్, మ్యూకోర్ మైకోసిస్ కూడా స్టెరాయిడ్ వాడకం వల్లనే వస్తుందని భావిస్తున్నారు. కోవిడ్ కేసుల్లో ప్రాణాల్ని రక్షించేందుకు కార్టికో స్టెరాయిడ్స్ (Steroids)ఎక్కువగా వాడటం వల్లన అవాస్కులర్ నెక్రోసిస్ కేసులు పెరుగుతున్నాయని గుర్తించారు. 


Also read: Covaxin vs Delta variant: డెల్టా వేరియంట్‌పై కొవాక్సిన్ ప్రభావం 65.2%: Bharat Biotech


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook