చెడు ఆహార పదార్ధాలు, జీవనశైలి కారణంగా మధుమేహం చాలా వేగంగా విస్తరిస్తోంది. ప్రతి పదిమందిలో 5-6 మందికి డయాబెటిస్ ఉందంటే అతిశయోక్తి కాదు. డయాబెటిస్ కారణంగా హార్ట్, కిడ్నీ,లివర్, కళ్లకు సంబంధించిన వ్యాధుల ముప్పు పెరుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరి డయాబెటిస్ రోగులు ఏం తినాలి, ఏం తినకూడదో ఇప్పుడు పరిశీలిద్దాం. కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ రోజూ ఉదయం పరగడుపున తీసకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఆ డ్రింక్స్ ఏంటనేది చూద్దాం.


డయాబెటిస్ రోగులకు కీరా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, బీ, సి, డీ వంటి పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు కీరాలో నీళ్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున కీరా జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 


టొమాటోను కూర రూపంలో లేదా సలాడ్ రూపంలో కాకుండా జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. డయాబెటిస్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే టొమాటోలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. 


డయాబెటిస్ రోగులకు కాకరకాయ చాలా మంచిది. ఉదయం పరగడుపున కాకరకాయ జ్యూస్ తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కాకరకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు దోహదపడతాయి.


Also read: Healthy Heart: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..రోజూ ఇలా చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook