ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ జిల్లాలో గల నానిదండ ప్రాంతంలో ప్రయాణీకుల బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 35 మంది చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


వంద అడుగులకు పైగా ఉన్న లోయలో బస్సు పడిపోవడంతో మృతుల సంఖ్య అధికంగా ఉందని ఘటనస్థలికి చేరుకున్న సహాయక బృందాలు తెలిపాయి. ఘటనాస్థలం నుంచి 20 మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీసినట్లు, దుర్ఘటనలో గాయపడ్డ 12 మందిని ఆసుపత్రికి తరలించినట్లు.. ఘటనకు సంబంధించి సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని గర్వాల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.