7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ అనేది ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్ ఈసారి సెప్టెంబర్ నెలలో పెరగనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి డీఏ 3 శాతం పెరగనుందని తెలుస్తోంది. జూలై నెల నుంచి ఎరియర్లతో పాటు అందనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెంపు ఉంటుంది. జనవరి, జూలై నెలలో డీఏ పెంపు జరుగుతుంటుంది. జనవరి డీఏ పెంపు 4 శాతం ఉండటంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. ఇక ఇప్పుడు జూలై డీఏ పెంపు సెప్టెంబర్ నుంచి అమలు కానుంది. డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రెండూ ఈసారి 3 శాతం ఉండవచ్చని అంచనా. అంటే మొత్తం డీఏ సెప్టెంబర్ నెల నుంచి 53 శాతానికి చేరుకోనుంది. ఇంతకుముందు డీఏ పెంపు మార్చ్ 7న జరిగింది. జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే మూడు నెలల ఎరియర్లతో పాటు ఉద్యోగులు, పెన్షనర్లకు డబ్బులు అందాయి. ఇక ఇప్పుడు జూలై నుంచి అమలు కావల్సిన డీఏ పెంపు సెప్టెంబర్‌లో నిర్ణయం ఉండవచ్చు. 


ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ఈ సంఘం 2014లో ఏర్పాటైంది. ప్రతి పదేళ్లకు కొత్త వేతన సంఘం ఏర్పాటు కావల్సి ఉంటుంది. 2014లో ఏర్పాటైన 7వ వేతన సంఘం 2016 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే వేతన సంఘం అమల్లోకి వచ్చేందుకు సాధారంగా రెండేళ్లు పడుతుంది. అందుకే 2026లో 8వ వేతన సంఘం అమల్లోకి రావాలంటే ఇప్పుడు ఏర్పాటు కావల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ చేస్తున్నారు.


Also read: Post Office Schemes: నెలకు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 4.21 లక్షలు మీ సొంతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook