ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీకు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. హిందూవాహిని పేరుతో గుర్తు తెలియని వ్యక్తి బెదిరిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీ నార్త్ ఎవెన్యూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆమ్ ఆద్మీ పార్టీ ( Aam Aadmi Party ) ఎంపీ సంజయ్ సింగ్ ( Mp Sanjay singh ) ‌కు ప్రాణభయం పట్టుకుంది. హిందూవాహిని సంస్థ పేరుతో ఫోన్ చేసి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఆప్ ఎంపీ ఢిల్లీ నార్త్ ఎవెన్యూ పోలీసులకు ( Delhi North Avenue police ) ఫిర్యాదు చేశారు. ఆప్ ఎంపీకు వస్తున్న కాల్స్ ఎంతవరకూ సీరియస్‌గా తీసుకోవాలనేదానిపై పోలీసులు పరిశీలిస్తున్నారు. 


ఆప్ (AAP ) పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు 7288088088 మొబైల్ నెంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి చంపేస్తామని బెదిరించాడు. తరచూ బెదిరింపు ఫోన్స్ ( Threatening calls ) వస్తుండటంతో ఆ ఫోన్‌ను తన సహోద్యోగి అజిత్ త్యాగి ఫోన్‌కు మళ్లించాడు. మద్యాహ్నం 3 గంటల 59 నిమిషాలకు మరోసారి ఫోన్ వచ్చింది. చంపేస్తానంటూ బెదిరించాడు. తాను హిందూవాహిని ( Hindu Vahini ) నుంచి మాట్లాడుతున్నట్టు తెలిపాడు. కిరోసిన్ పోసి సజీవ దహనం చేసేస్తానని కూడా బెదిరించాడు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ( Aap mp sanjay singh ) ఇచ్చిన ఫిర్యాదు సారాంశం ఇది. 


పోలీసులకిచ్చిన ఫిర్యాదు కాపీను ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  ఎంపీ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


Also read: COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్న వార్డ్ బాయ్ ఆకస్మిక మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook