విమాన ప్రయాణికులకు శుభవార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా సరికొత్త ఆఫర్ తెరపైకి తెచ్చింది. కేవలం రూ999కే విమాన ప్రయాణం అందిస్తోంది. ఈ ఆఫర్ డెమొస్టిక్ విమాన ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. మరోవైపు విదేశీ ప్రయాణికులకూ ఎయిర్ ఏషియా కొన్ని ఆఫర్లు ప్రకటించింది. ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు వెళ్లే వారికి డిస్కౌంట్లు వర్తిస్తాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఎయిర్ ఏషియా వెబ్ సైట్లోకి వెళ్లి టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. 


ఎయిర్ ఏషియా ప్రకటించిన ఆఫర్ కు కొన్ని పరిమితులు విధించింది. విమానయాన సంస్థ ఎంపిక చేసిన ప్రాంతాలు, రూట్లకే పరిమితం చేసింది. నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఆగస్ట్ 13 వరకు ప్రయాణించాలనుకునే వారు ఈ తగ్గింపు ధరలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.  ఈ నెల 27వ తేదీ వరకు టికెట్లను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.