Amul Milk New Price: మదర్ డెయిరీ తరపున పాల ధరను పెంచిన అమూల్.. ఇప్పుడు పాల ధరను కూడా పెంచింది. లీటరు పాల ధరను 3 రూపాయల వరకు పెంచారు. ఈ పెంపు తర్వాత ఒక లీటర్ అమూల్ గోల్డ్ ధర రూ.63 నుంచి రూ.66కి పెరిగింది. అదేవిధంగా లీటర్ అమూల్ పాలకు రూ.54 చెల్లించాల్సి ఉంటుంది. అమూల్ ఆవు పాలకు 56 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమూల్ ఏ2 గేదె పాల ధర లీటరుకు రూ.70కి పెరిగినట్లు కంపెనీ నుంచి సమాచారం. ఈ ఏడాది తొలిసారిగా అమూల్ పాల ధరను పెంచింది. గతంలో అమూల్ 2022లో పాల ధరను మూడుసార్లు పెంచింది. గతేడాది మార్చి, ఆగస్టు, అక్టోబర్‌లలో పాలధరను. పెరుగుతున్న ధరల దృష్ట్యా పాల ధరను పెంచినట్లు కంపెనీ తెలిపింది. గతంలో సాధారణంగా లీటరుకు రూ.2 పెంచగా.. ఈసారి రూ.3 పెంచారు.


అంతకుముందు మదర్ డెయిరీ డిసెంబర్‌లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో లీటరు పాల ధరను రూ.2 పెంచింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గతేడాది మదర్ డెయిరీ ధరను ఐదుసార్లు పెంచింది. ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో మదర్ డెయిరీ రోజుకు 30 లక్షల లీటర్లకు పైగా పాలను విక్రయిస్తోంది. గత పెంపు తర్వాత మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటరుకు రూ.66కి పెరిగింది. ఇదికాకుండా టోన్డ్ మిల్క్‌ను లీటరు రూ.53 చొప్పున విక్రయిస్తున్నారు. డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరు రూ.47. అయితే ఆవు పాల సంచి, కంపెనీ టోకెన్‌తో కొనుగోలు చేసిన పాల ధరలో ఎలాంటి మార్పు లేదు.


నేటి నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన అమూల్ పాల ధరల అములులోకి వచ్చాయి. తాజా ధరల జాబితాను గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సేల్స్ సీనియర్ మేనేజర్ ప్రకాష్ ఔటే వెల్లడించారు. కేవలం పశువుల దాణా ఖర్చ వల్లే 20 శాతం పెరిగిందని అమూల్ కంపెనీ తెలిపింది.


Also Read:  Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్‌ సినిమా క్యాస్టింగ్ ఇదే


Also Read: Sai Pallavi : జీవితంలో అవి ఉంటే చాలట.. నవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook