వందేభారత్ రైళ్ల  ( Vende bharat trains ) నిర్మాణ గ్లోబల్  టెండర్లను భారతీయ రైల్వే రద్దు చేసింది.  44 సెమీ హైస్పీడ్ రైళ్ల నిర్మాణం నిమిత్తం పిలిచిన ఈ టెండర్ల రద్దు చైనాకు అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇండియా చైనా సరిహద్దు ఘర్షణ ( indo china border dispute ) చాలా రకాలుగా ప్రభావం చూపిస్తోంది. చైనా దేశపు యాప్ లను ( China apps ) ఇప్పటికే నిషేధించిన ఇండియా...ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 44 సెమీ హై స్పీడ్ వందేభారత్ రైళ్ల నిర్మాణం కోసం ఇండియన్ రైల్వేస్ ( Indian railways ) పిలిచిన గ్లోబల్ టెండర్లను ( Global tenders ) రద్దు చేసింది. ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రైళ్లను ఇండియానే స్వయంగా తయారు చేయనుంది.  రైల్వే శాఖ తీసుకున్న టెండర్ల రద్దు నిర్ణయం చైనాకు షాక్ ( Shock to china ) గా చెప్పవచ్చు. 


ఎందుకంటే ఈ టెండర్లలో చైనాకు చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ సీఆర్పీసీ ( CRRC ) పయనీర్ ( Pioneer ) ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏకైక విదేశీ బిడ్డర్ గా ఉంది. గురుగ్రామ్ కు చెందిన పయనీర్ కంపెనీతో చైనాకు చెందిన సీఆర్పీసీ యోంగ్ జి ( CRRC Yongjiఎలక్ట్రిక్ కంపెనీ 2015లో జాయింట్ వెంచర్ నెలకొల్పింది.  వాస్తవానికి 44 వందేభారత్ రైళ్ల నిర్మాణ టెండర్ ఈ చైనా కంపెనీకు దక్కే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. టెండర్లను రద్దు చేయడంతో చైనా కంపెనీకు పెద్ద షాక్ గా చెప్పవచ్చు. Also read: Election Commission: భారత నూతన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్