Bihar Election Result 2020 Update: పాట్నా: బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్డీఏ, మహాఘట్‌బంధన్ మధ్య పోటాపోటీ ఆధిక్యం కొనసాగుతోంది. మరి కాసేపట్లో బీహార్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై ఒక స్పష్టతరానుంది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో మొదట కూటమి ఆధిక్యంలో ఉండగా.. ప్రస్తుతం అనూహ్యంగా పుంజుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ ( BJP - JDU) కూటమి అనూహ్యంగా పుంజుకుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 121 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మహాఘట్‌బంధన్ (RJD- Congress-Left) 112 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఎన్నికల సంఘం ట్రెండ్స్ ప్రకారం.. 
ఎన్డీఏ 97 సీట్లల్లో లీడ్‌లో ఉంది. BJP 53, JDU 39, VIP 5 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. 
మహాఘట్‌బంధన్ 82 స్థానాల్లో లీడ్‌లో ఉంది.  RJD 54, Congress 14, Left 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 
దీంతోపాటు BSP 1, LJP 4, AIMIM 2, independents 3 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు.
అయితే వాల్మీకినగర్ ఎంపీ స్థానంలో JDU అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు.  Also read: 
Bihar Election Result: ఓట్ల లెక్కింపు ప్రారంభం