గుజరాత్: ఊరు గెలిచి ఇంట్లో ఓటమి అన్న చందంగా ఉంది ప్రధాని మోడీ పరిస్థితి..రాష్ట్రంలో కాంగ్రెస్ ను మట్టికరిపించి విజయం సాధించిన మోడీకి తన సొంత నియోజకర్గంలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోడీ సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి  ఓటమి పాలయ్యారు.  ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నారాయణ్‌భాయ్ లల్లుదాస్, కాంగ్రెస్ అభ్యర్థి ఆశా పటేల్ చేతిలో 19 వేల 529 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.ఆశాపటేల్‌కు 81వేల 797 ఓట్లు పోలవగా, నారాయణ్‌భాయ్‌కు 62 వేల 268 ఓట్లు పోలయ్యాయి. కాగా ప్రధాని మోదీ స్వస్థలం ఉంఝాలో బీజేపీ ఓటమిపాలవడం చర్చనీయాంశమైంది.