న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా పైబడి పకడ్బందీగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా (Covid-19) మహమ్మారి విజృంభణ తగ్గడం లేదు. ఈ క్రమంలో మే 31న ముగియనున్న(Lockdown) లాక్ డౌన్ 4.0 నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ప్రకటించనున్నారా అనే కోణంలో కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు కొనసాగిస్తోంది. నీళ్లు తాగడానికి వచ్చే జంతువులను మొసలి ఎలా వేటాడుతుందో చూడండి ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Leopard attack video : వలకు చిక్కిన చిరుత.. అటవీ శాఖ సిబ్బందిపై దాడి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు


ఇదిలాఉండగా న్యూస్ ఛానెళ్లలో చర్చల్లో ఎక్కువగా కనిపించే బీజేపీ జాతీయ అధికార ప్రతినిది సంబిత్ పాత్ర. ఇటు సామజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉన్న ఆయన గురువారం పలు ట్వీట్లను పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా కోవిడ్ -19 లక్షణాలతో బాధపడుతున్నారని, అయితే ఈ మధ్యాహ్నం గుర్గావ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆసుపత్రి వర్గాలు గురువారం తెలిపాయి. ఆసుపత్రిలో చేరిన సంబిత్ పాత్ర్ర కోవిడ్-19 లక్షణాలున్నట్లు మేదాంత ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..